మొదట్లో కథ ఎక్కడో ఆకాశంలో సంచరిస్తుండేది .కనిపించని దేవతలే పాత్రలై మనుషులకి నీతులు చేపడానికి తోడ్పడేది. కల్పిత ప్రదానంగా సాగేది. క్రమంగా కథ నేలకి దిగింది. చుట్టూ ఉన్న పరిసరాలని చూస్తూ ఆ పరిసరాల్నీ వస్తువులుగా చేసుకుంటూ ఆ పరిసరాలలో సంచరించే వ్యక్తులనే పాత్రలుగా చేసుకుంటూ - వాళ్ళు మట్లాడే భాషలోనే చెప్పడం ప్రారంబించింది అలా వస్తుపరంగా, భాషపరంగా శిల్పపరంగా ఆధునికతను సంతరించుకుని నేలబారున సాగకుండా నేల మూలమూలలకి బుల్లెట్ లా దూసుకుపోసాగింది.
ఇప్పుడు కథానిక సృష్టించని సామజిక అంశం లేదు.పలుకరించని మనిషిలేడు మూలమూలల నుంచి రచయితలు కథానిక రచనని ఒక సామజిక బాధ్యతగా చేపట్టడమే అందుకు కారణం. ఎవరి సమాజం గురించి వాళ్ళు మాట్లాడుకునే భాషలో రాయాలనే తపన పెరిగింది. సమాజం మూలల్లోకి వెళ్లిన కథానిక కేవలం సమాజానికి అర్థమయ్యేటట్టు చేస్తోంది. ఎవరు ఏ కోణంలో ఏ అంశాన్నచూడాలో చెబుతోంది.
మనిషికి వయసున్నట్లుగానే రచనలకి వయసుంటుంది. కొంతమంది పిల్లలు పురిట్లోనే పోయినట్లు, కొన్ని కథానికల్ని చదివిచదవగానే మరచిపోతాం. మన కర్మకాలి చదవడమే ఆలశ్యం.తెగ ఆనందపడిపోయి ఆ కథానికని చదవమని తెలిసిన వాళ్ళందరికీ పదే పదే చెప్తాం. మరికొన్ని కథానికల్ని కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కొన్ని కథానికల్ని మరచిపోలేం.
ఒక చదువరిని ఎంత ఎక్కువకాలం మరచిపోకుండా చేస్తే అది అంత గొప్ప కథానిక, ఆలాంటి గొప్ప కథానికలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్పవచ్చు.
పండు (శ్వేతా )
Abbo...articles kuda start chesava....nice pandu...nee kadanika ni nenu kaadananu ika.....good work
ReplyDeletechala bagundii panduuu
ReplyDeletemeaning super ga undiiiii
Superb chelli...
ReplyDelete